ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- January 22, 2026
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కు చెందిన మరో కీలక నేతకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను విచారణకు హాజరుకావాల్సిందిగా సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఇదే కేసుకు సంబంధించి సిట్ ఈ నెల 20న హరీశ్ రావును పిలిపించి విచారించింది. సుమారు 7 గంటల పాటు హరీశ్ రావును సిట్ విచారించింది. అవసరం అయితే మళ్లీ పిలుస్తామని సీపీ సజ్జనార్ తెలిపారు.
ఇప్పుడు తాజాగా కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసింది సిట్. కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్లలో ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఆయన నివాసానికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాల్సిందిగా సిట్ నోటీసుల్లో పేర్కొంది.
కేటీఆర్ కి సిట్ నోటీసులు నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు తెలంగాణ భవన్ కి రానున్నారు. తెలంగాణ భవన్ నుంచి సిట్ విచారణకి కేటీఆర్ వెళ్లనున్నారు. తెలంగాణ భవన్ లోనే ఉండి హరీశ్ రావు మానిటరింగ్ చేయనున్నారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









