H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- January 25, 2026
అమెరికా: అమెరికాలో పనిచేస్తున్న భారతీయ H-1B వీసాదారులకు ఊహించని షాక్ తగిలింది. వీసా స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన వేలాది మంది నిపుణులు ఇక్కడే చిక్కుకుపోయారు. వారి వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లు ఏకంగా 2027 సంవత్సరానికి వాయిదా పడటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా కొద్ది రోజుల్లో ముగిసే ఈ ప్రక్రియ, ఇప్పుడు ఏడాదికి పైగా ఆలస్యం కావడంతో వారి ఉద్యోగాలు, కుటుంబ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
2025 డిసెంబర్ మధ్య నుంచి యూఎస్ కాన్సులేట్లు కొత్త భద్రతా నిబంధనలను అమలు చేయడమే ఈ జాప్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. దీనివల్ల ఒక్కో దరఖాస్తుకు అదనంగా 20-30 నిమిషాల సమయం పడుతుండటంతో, రోజువారీగా నిర్వహించే ఇంటర్వ్యూల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
2026 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సిన వారికి కూడా తాజాగా 2027 ఏప్రిల్, మే నెలలకు తేదీలను మారుస్తున్నట్లు ఈ-మెయిల్స్ వస్తున్నాయి. దీంతో వీసా స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన ఉద్యోగులు అమెరికాలోని తమ కుటుంబాలకు, పిల్లలకు దూరమయ్యారు. అక్కడ ఇళ్ల అద్దెలు, ఇతర బిల్లులు చెల్లిస్తూనే ఇక్కడ చిక్కుకుపోవడంతో తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
ఈ సంక్షోభం దృష్ట్యా, అమెరికాలో ఉన్న H-1B ఉద్యోగులు అత్యవసరం అయితే తప్ప వీసా స్టాంపింగ్ కోసం భారత్కు ప్రయాణించవద్దని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి 2027 వరకు కొత్తగా సాధారణ ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులో లేకపోవడంతో, వేలాది మంది భారతీయ నిపుణుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







