H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- January 25, 2026
అమెరికా: అమెరికాలో పనిచేస్తున్న భారతీయ H-1B వీసాదారులకు ఊహించని షాక్ తగిలింది. వీసా స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన వేలాది మంది నిపుణులు ఇక్కడే చిక్కుకుపోయారు. వారి వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లు ఏకంగా 2027 సంవత్సరానికి వాయిదా పడటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా కొద్ది రోజుల్లో ముగిసే ఈ ప్రక్రియ, ఇప్పుడు ఏడాదికి పైగా ఆలస్యం కావడంతో వారి ఉద్యోగాలు, కుటుంబ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
2025 డిసెంబర్ మధ్య నుంచి యూఎస్ కాన్సులేట్లు కొత్త భద్రతా నిబంధనలను అమలు చేయడమే ఈ జాప్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. దీనివల్ల ఒక్కో దరఖాస్తుకు అదనంగా 20-30 నిమిషాల సమయం పడుతుండటంతో, రోజువారీగా నిర్వహించే ఇంటర్వ్యూల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
2026 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సిన వారికి కూడా తాజాగా 2027 ఏప్రిల్, మే నెలలకు తేదీలను మారుస్తున్నట్లు ఈ-మెయిల్స్ వస్తున్నాయి. దీంతో వీసా స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన ఉద్యోగులు అమెరికాలోని తమ కుటుంబాలకు, పిల్లలకు దూరమయ్యారు. అక్కడ ఇళ్ల అద్దెలు, ఇతర బిల్లులు చెల్లిస్తూనే ఇక్కడ చిక్కుకుపోవడంతో తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
ఈ సంక్షోభం దృష్ట్యా, అమెరికాలో ఉన్న H-1B ఉద్యోగులు అత్యవసరం అయితే తప్ప వీసా స్టాంపింగ్ కోసం భారత్కు ప్రయాణించవద్దని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి 2027 వరకు కొత్తగా సాధారణ ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులో లేకపోవడంతో, వేలాది మంది భారతీయ నిపుణుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







