మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- January 26, 2026
మస్కట్: మస్కట్లోని భారత రాయబార కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేశభక్తి స్ఫూర్తితో పాటు భారత ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఛార్జ్ డి అఫైర్స్ తవిషి బెహల్ పాండే.. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం భారత జెండాను ఆవిష్కరించారు. ఇండియన్ స్కూల్ మస్కట్ విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఛార్జ్ డి అఫైర్స్ భారత రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవ ప్రసంగంలోని కొన్ని భాగాలను చదివి వినిపించారు. ఇందులో భారతదేశ పురోగతి, ప్రజాస్వామ్య విలువలు మరియు భవిష్యత్ ఆకాంక్షలను హైలైట్ చేశారు.
పోర్బందర్ నుండి మస్కట్కు ఐఎన్ఎస్వి కౌండిన్య తొలి సముద్రయానం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, కమాండర్ వై. హేమంత్ మరియు కమాండర్ వికాస్ షియోరాన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేకంగా నిలిచింది.
తాజా వార్తలు
- అల్ బహియాలో పాలస్తీనా జాతీయుడు మృతి: అబుదాబి
- హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం..
- ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం









