టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- March 16, 2026
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలోని 33 విద్యాసంస్థలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దాదాపు రూ. 118.89 కోట్ల నిధులను కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులతో సుమారు 21,580 మంది విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యారంగానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం విశేషం.
ఈ వినూత్న ప్రాజెక్టు ద్వారా పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, అత్యాధునిక హాస్టల్ బ్లాకులు మరియు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు వేడినీళ్లు, నాణ్యమైన వంట సామగ్రి వంటి కనీస వసతులను మెరుగుపరుస్తూనే, పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ కూడా అందించనున్నారు. ముఖ్యంగా శ్రీపద్మావతి మహిళా విద్యాసంస్థల్లో విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. బోధన సిబ్బందికి కూడా ఆధునిక సాంకేతికతపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి విద్యా ప్రమాణాలను పెంచనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు









