టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- March 16, 2026
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలోని 33 విద్యాసంస్థలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దాదాపు రూ. 118.89 కోట్ల నిధులను కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులతో సుమారు 21,580 మంది విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యారంగానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం విశేషం.
ఈ వినూత్న ప్రాజెక్టు ద్వారా పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, అత్యాధునిక హాస్టల్ బ్లాకులు మరియు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు వేడినీళ్లు, నాణ్యమైన వంట సామగ్రి వంటి కనీస వసతులను మెరుగుపరుస్తూనే, పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ కూడా అందించనున్నారు. ముఖ్యంగా శ్రీపద్మావతి మహిళా విద్యాసంస్థల్లో విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. బోధన సిబ్బందికి కూడా ఆధునిక సాంకేతికతపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి విద్యా ప్రమాణాలను పెంచనున్నారు.
తాజా వార్తలు
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం







