ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- March 16, 2026
ఒడిశా: ఎస్సీబీ వైద్య కళాశాల ఆస్పత్రి ట్రామా కేర్ ఐసీయూలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10మంది రోగులు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి.గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒడిశాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కటక్ నగరంలోని ఎస్సీబీ (SCB) మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలోని ట్రామా కేర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో సోమవారం తెల్లవారు జామున అగ్నిప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి ట్రామా కేర్ ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 10మంది రోగులు మృతి చెందారు. వీరిలో ఏడుగురు ఐసీయూ లోపల మరణించగా.. మరో ముగ్గురు సహాయక చర్య సమయంలో ఇతర వార్డులకు తరలిస్తుండగా మరణించారు. 11మందికి గాయాలయ్యాయి. వారికి చికిత్స అందిస్తున్నారు.
అగ్నిప్రమాద ఘటన పై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన స్థలికి చేరుకొని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారంను సీఎం మోహన్ చరణ్ మాఝీ ప్రకటించారు. అగ్నిప్రమాదం ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









