30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్
- February 02, 2026
కంపెనీల AI డేటా-సెంటర్ విస్తరణకు అమెరికా బ్యాంకులు నిధులు సమకూర్చడంలో వెనుకడుగు వేస్తున్న నేపథ్యంలో.. టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) తన వ్యూహాత్మక వ్యయ నిర్మాణాన్ని తిరిగి సమీక్షిస్తోంది. ఈ క్రమంలోనే తమ వర్క్ ఫోర్స్ నుంచి 20 వేల నుంచి 30 వేల వరకు తగ్గించడానికి రెడీ అయింది. అలాగే తన కొన్ని వ్యాపార విభాగాలను విక్రయించడం వంటి కీలక నిర్ణయాలను పరిశీలిస్తున్నట్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ TD కోవెన్ వెల్లడించింది. ఈ చర్యలు ఒరాకిల్ చేపట్టనున్న భారీ AI మౌలిక సదుపాయాల విస్తరణకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు తీసుకుంటున్న చర్యలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
TD కోవెన్ రూపొందించిన పరిశోధనా నివేదిక ప్రకారం.. ఉద్యోగాల కోత ద్వారా ఒరాకిల్కు సుమారు 8 బిలియన్ నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు నగదు ప్రవాహం సేవ్ కావచ్చు. ఇదే సమయంలో 2022లో 28.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఆరోగ్య సంరక్షణ సాఫ్ట్వేర్ యూనిట్ ‘సెర్నర్’ విక్రయాన్ని కూడా కంపెనీ పరిశీలిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ విక్రయం జరిగితే ఒరాకిల్కు తక్షణ మూలధన అవసరాలను తీర్చుకునే అవకాశం లభించవచ్చని అంచనా. అయితే, ఈ నిర్ణయాలకు ప్రధాన కారణం ఒరాకిల్కు అనుబంధంగా ఉన్న డేటా-సెంటర్ ప్రాజెక్టుల రుణాల విషయంలో అనేక అమెరికా బ్యాంకులు వెనక్కి తగ్గడమే. ఈక్విటీ, డెట్ ఇన్వెస్టర్లు ఇద్దరూ, ఈ భారీ స్థాయి డేటా-సెంటర్ నిర్మాణాలకు అవసరమైన నిధులను ఒరాకిల్ స్వయంగా సమకూర్చగలదా అనే అంశంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారని TD కోవెన్ నివేదిక స్పష్టం చేసింది.
సంస్థ మౌలిక సదుపాయాల నిబద్ధతల స్థాయి కారణంగా ఫైనాన్సింగ్ సవాళ్లు తలెత్తాయని..మొత్తం అవసరమైన మూలధన వ్యయం సుమారు 156 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా వేసింది. బ్యాంకింగ్ రంగంలో వచ్చిన ఈ తిరోగమనం ఒరాకిల్ రుణ ఖర్చులను గణనీయంగా పెంచింది. సెప్టెంబర్ నుంచి డేటా-సెంటర్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ కోసం రుణదాతలు వసూలు చేసే వడ్డీ రేటు ప్రీమియంలు దాదాపు రెట్టింపు అయ్యాయని, ఇవి సాధారణంగా తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న కంపెనీలకు వర్తించే స్థాయికి చేరాయని TD కోవెన్ తెలిపింది. ఈ అధిక రుణ వ్యయాలు అనేక ఒప్పందాలను నిలిపివేయడానికి దారితీశాయి. ప్రైవేట్ డేటా-సెంటర్ ఆపరేటర్లతో ఒరాకిల్ చర్చలు జరుపుతున్న లీజులు ఫైనాన్సింగ్ పొందడంలో విఫలమవుతున్నాయని నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- ఉక్రెయిన్లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి
- 30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్
- హైదరాబాద్ లో పెరుగుతున్న ఎండలు
- ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- భారత్తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!







