సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- February 02, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) అవినీతి ఆరోపణలపై 127 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసింది. గత జనవరి నెలలో నిర్వహించిన 1,543 స్పాట్ తనఖీల సందర్భంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలలో సమగ్రతను ప్రోత్సహించడానికి మరియు అవినీతిని ఎదుర్కోవడానికి నిరంతర ప్రయత్నాలలో భాగంగా 383 మంది ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది.
కాగా, అరెస్టు అయిన వారిలో కొందరిని బెయిల్పై ఇప్పటికే విడుదల చేశారు. అరెస్టయిన వారిలో ఉద్యోగులు రక్షణ మంత్రిత్వ శాఖ, అంతర్గత మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సహా పలు మంత్రిత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు.
తాజా వార్తలు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న
- అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!







