వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- February 02, 2026
దోహా: వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 సందర్భంగా టెక్ స్టార్టప్లకు $2 బిలియన్ల ప్రోత్సాహాన్ని ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ ప్రకటించారు. కేవలం రెండు సంవత్సరాలలో వెబ్ సమ్మిట్ ఖతార్ ప్రపంచ టెక్ కమ్యూనిటీకి కీలకమైన రిఫరెన్స్ పాయింట్గా అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ప్రోగ్రామ్ విస్తరణతో సహా అనేక చొరవలను ప్రకటించారు.
అలాగే, స్టార్టప్ వ్యవస్థాపకులు మరియు ఉన్నతస్థాయిలో ఉండే అధికారులకు 10 సంవత్సరాల రెసిడెన్సీ అందించే కొత్త రెసిడెన్సీ ప్రోగ్రామ్ ను కూడా ప్రకటించారు. ప్రపంచ పరిశోధన మరియు అభివృద్ధి వ్యయం ఏటా $3 ట్రిలియన్లకు చేరుకుంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఖతార్లో ప్రస్తుతం మూడో సంవత్సరం జరుగుతున్న ఈ సమ్మిట్ కు 120 కి పైగా దేశాల నుండి నిపుణులు హాజరయ్యారు. ఈ సమావేశం రికార్డు స్థాయిలో 1,600 స్టార్టప్లను ఆకర్షిస్తోందని, 85 శాతం ఖతార్ వెలుపల నుండి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









