బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- February 03, 2026
యూఏఈ: గత సంవత్సరం జరిగిన ఘోరమైన విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా ప్రతి టెక్నికల్ సమస్యలను సీరియస్ గా తీసుకుంటుంది. తాజాగా ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లో సమస్య ఉందని ఒక పైలట్ రిపోర్టు చేసిన నేపథ్యంలో సోమవారం తమ బోయింగ్ డ్రీమ్లైనర్లలో ఒకదాన్ని నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
విమానాన్ని నిలిపివేసామని, పైలట్ ఆందోళనలను ప్రాధాన్యతా ప్రాతిపదికన నిపుణులతో వెంటనే తనిఖీలు చేయించామని ఎయిర్లైన్ వెల్లడించింది. ఈ విషయాన్ని భారత విమానయాన నియంత్రణ సంస్థకు తెలియజేసినట్లు తెలిపింది.
గత సంవత్సరం రెగ్యులేటర్ నుండి వచ్చిన ఆదేశాల తర్వాత సోమవారం తమ వద్ద ఉన్న బోయింగ్ 787 విమానాలలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లను తనిఖీ చేశామని, ఎటువంటి సమస్యలు లేవని ఎయిర్ ఇండియా తెలిపింది.
గత సంవత్సరం జూన్లో ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ ప్రమాదంలో 260 మంది మరణించినప్పటి నుండి టాటా గ్రూప్ మరియు సింగపూర్ ఎయిర్లైన్స్ యాజమాన్యంలోని క్యారియర్ విమానాల తనిఖీలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది.
తాజా వార్తలు
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్









