బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- February 03, 2026
యూఏఈ: గత సంవత్సరం జరిగిన ఘోరమైన విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా ప్రతి టెక్నికల్ సమస్యలను సీరియస్ గా తీసుకుంటుంది. తాజాగా ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లో సమస్య ఉందని ఒక పైలట్ రిపోర్టు చేసిన నేపథ్యంలో సోమవారం తమ బోయింగ్ డ్రీమ్లైనర్లలో ఒకదాన్ని నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
విమానాన్ని నిలిపివేసామని, పైలట్ ఆందోళనలను ప్రాధాన్యతా ప్రాతిపదికన నిపుణులతో వెంటనే తనిఖీలు చేయించామని ఎయిర్లైన్ వెల్లడించింది. ఈ విషయాన్ని భారత విమానయాన నియంత్రణ సంస్థకు తెలియజేసినట్లు తెలిపింది.
గత సంవత్సరం రెగ్యులేటర్ నుండి వచ్చిన ఆదేశాల తర్వాత సోమవారం తమ వద్ద ఉన్న బోయింగ్ 787 విమానాలలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లను తనిఖీ చేశామని, ఎటువంటి సమస్యలు లేవని ఎయిర్ ఇండియా తెలిపింది.
గత సంవత్సరం జూన్లో ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ ప్రమాదంలో 260 మంది మరణించినప్పటి నుండి టాటా గ్రూప్ మరియు సింగపూర్ ఎయిర్లైన్స్ యాజమాన్యంలోని క్యారియర్ విమానాల తనిఖీలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







