బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- February 03, 2026
యూఏఈ: గత సంవత్సరం జరిగిన ఘోరమైన విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా ప్రతి టెక్నికల్ సమస్యలను సీరియస్ గా తీసుకుంటుంది. తాజాగా ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లో సమస్య ఉందని ఒక పైలట్ రిపోర్టు చేసిన నేపథ్యంలో సోమవారం తమ బోయింగ్ డ్రీమ్లైనర్లలో ఒకదాన్ని నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
విమానాన్ని నిలిపివేసామని, పైలట్ ఆందోళనలను ప్రాధాన్యతా ప్రాతిపదికన నిపుణులతో వెంటనే తనిఖీలు చేయించామని ఎయిర్లైన్ వెల్లడించింది. ఈ విషయాన్ని భారత విమానయాన నియంత్రణ సంస్థకు తెలియజేసినట్లు తెలిపింది.
గత సంవత్సరం రెగ్యులేటర్ నుండి వచ్చిన ఆదేశాల తర్వాత సోమవారం తమ వద్ద ఉన్న బోయింగ్ 787 విమానాలలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లను తనిఖీ చేశామని, ఎటువంటి సమస్యలు లేవని ఎయిర్ ఇండియా తెలిపింది.
గత సంవత్సరం జూన్లో ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ ప్రమాదంలో 260 మంది మరణించినప్పటి నుండి టాటా గ్రూప్ మరియు సింగపూర్ ఎయిర్లైన్స్ యాజమాన్యంలోని క్యారియర్ విమానాల తనిఖీలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈ బతుకమ్మ సంబరాలకు కేటీఆర్కు ఆహ్వానం
- అమెరికా-ఇరాన్ చర్చలు సఫలమైతే తగ్గనున్న ఇంధన ధరలు: ట్రంప్
- షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు రాహుల్ డిమాండ్
- కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేసే వేదిక ‘అమరావతి చిత్రకళా వీధి’: మంత్రి దుర్గేష్
- ₹220 కోట్లు ఖర్చు చేసి కుక్కలా మారిన 26 ఏళ్ల కోటీశ్వరుడా?
- తెలుగు రాష్ట్రాలకు ఐఎమ్డీ అలర్ట్: వచ్చే 5 రోజులు వర్షాలు
- యూఏఈ కస్టమ్స్ చర్యలను సమీక్షించిన షేక్ జాయెద్ బిన్ హమద్
- కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన లులు చైర్మన్ యూసఫ్ అలీ
- కువైట్లో ఫ్యామిలీ విజిట్ వీసా నిబంధనల్లో మార్పులు..!!
- అల్ హల్లానియత్ దీవుల వద్ద నౌక ప్రమాదం..!!







