తెదేపా ఎంపీలతో భేటీ కానున్నా చంద్రబాబు

- July 30, 2016 , by Maagulf
తెదేపా ఎంపీలతో భేటీ కానున్నా చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం విజయవాడలో తెదేపా ఎంపీలతో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. సమావేశానికి హాజరుకావాలని సీఎం కార్యాలయం నుంచి ఎంపీలకు సమాచారం అందింది. ప్రత్యేక హోదాపై నిన్న రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనపై తెదేపా నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లాలో ఇవాళ రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ మాట్లాడుతూ..రేపటి సమావేశంలో ప్రత్యేక హోదాపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు. అవసరం అనుకుంటే రాజీనామాకైనా సిద్ధమని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com