ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ
- February 08, 2026
కౌలాలంపూర్: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కఠిన విధానాన్నే కొనసాగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మలేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయిన మోదీ, ఉగ్రవాదంపై భారత్ వైఖరి పూర్తిగా స్పష్టమని, ఈ విషయంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు లేదా రాజీ విధానానికి తావులేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భారత్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఆయన మాట్లాడారు. ఇరు దేశాలు సముద్ర సరిహద్దులు పంచుకుంటున్నాయని, ప్రజల మధ్య సాంస్కృతిక, వాణిజ్య, ఆర్థిక సంబంధాలు బలంగా ఉన్నాయని మోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులకు కీలకంగా మారిందన్నారు.
అలాగే ఇండో–పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక వృద్ధికి ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వం కోసం భారత్ ఇతర దేశాలతో కలిసి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. భద్రత, రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో మలేషియాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









