ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ
- February 08, 2026
కౌలాలంపూర్: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కఠిన విధానాన్నే కొనసాగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మలేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయిన మోదీ, ఉగ్రవాదంపై భారత్ వైఖరి పూర్తిగా స్పష్టమని, ఈ విషయంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు లేదా రాజీ విధానానికి తావులేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భారత్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఆయన మాట్లాడారు. ఇరు దేశాలు సముద్ర సరిహద్దులు పంచుకుంటున్నాయని, ప్రజల మధ్య సాంస్కృతిక, వాణిజ్య, ఆర్థిక సంబంధాలు బలంగా ఉన్నాయని మోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులకు కీలకంగా మారిందన్నారు.
అలాగే ఇండో–పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక వృద్ధికి ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వం కోసం భారత్ ఇతర దేశాలతో కలిసి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. భద్రత, రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో మలేషియాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు
- సీఎంగా రెండోసారి హిమంత్ బిశ్వశర్మ
- ప్రధాని మోదీ వెళ్లే దారిలో పేలుడు పదార్థాల గుర్తింపు!
- దుబాయ్లో తొలి స్మార్ట్ బస్ స్టేషన్ ప్రారంభం
- సౌదీలో గొర్రెల కాపరిగా కష్టాలు పడుతున్న యువకుడు
- ఏపీ చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్గా పి.భరత్ భూషణ్..
- ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేసిన సీఎం విజయ్
- డెన్వర్ ఎయిర్పోర్ట్లో విమాన ప్రమాదం
- 29 ఏళ్లకే మంత్రిగా ఎస్.కీర్తన సరికొత్త రికార్డు
- తమిళనాడులో కొత్త శకం మొదలైంది–విజయ్ కీలక వ్యాఖ్యలు
- 500 మంది రొమ్ము క్యాన్సర్ బాధితులకు పీహెచ్సీసీ కేటాయింపు..!!









