ఖతార్లో కస్టమ్స్ సేవల మెరుగుదలకు ‘షారెక్’లో సర్వే..!!
- August 18, 2026
దోహా: ఖతార్లో కస్టమ్స్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ (GAC) ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. సివిల్ సర్వీస్ అండ్ గవర్నమెంట్ డెవలప్మెంట్ బ్యూరో (CGB) సమన్వయంతో ‘షారెక్’ డిజిటల్ వేదికపై ఈ సర్వేను ప్రారంభించింది.
దేశవ్యాప్తంగా కస్టమ్స్ సేవలపై ప్రజల్లో ఉన్న సంతృప్తి, అవగాహనను తెలుసుకోవడం ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పౌరులు, ప్రవాసులు, వ్యాపార వర్గాల నుంచి నేరుగా అభిప్రాయాలను సేకరించి సేవల్లో అవసరమైన మార్పులను గుర్తించనున్నారు.
కమ్యూనిటీ భద్రతను కాపాడటంతో పాటు అంతర్జాతీయ వాణిజ్యం సజావుగా సాగేందుకు కస్టమ్స్ అధికారులు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విమాన, సముద్ర, భూ సరిహద్దుల్లో నియంత్రణతో పాటు సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలోనూ కస్టమ్స్ కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రజల నుంచి వచ్చే సూచనలు కస్టమ్స్ ప్రక్రియలను మరింత సులభతరం చేయడానికి, క్లియరెన్స్ విధానాలను మెరుగుపరచడానికి, కస్టమర్ సేవల ప్రమాణాలను పెంచడానికి ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
ప్రభుత్వ సంస్థలు, ప్రజల మధ్య డిజిటల్ వారధిగా ‘షారెక్’ వేదిక పనిచేస్తోంది. ఈ వేదిక ద్వారా ప్రజలు తమ సేవల అనుభవాలను పంచుకోవడంతో పాటు సూచనలు, అభిప్రాయాలను సులభంగా తెలియజేయవచ్చు. పౌరులు, ప్రవాసులు, వ్యాపార రంగ ప్రతినిధులు ‘షారెక్’ వేదికను సందర్శించి ప్రశ్నావళిని పూర్తి చేయాలని CGB కోరింది.
కాగా, సర్వే ద్వారా వచ్చిన అభిప్రాయాలను GAC, CGBకు చెందిన సంయుక్త బృందాలు విశ్లేషించనున్నాయి. వాటి ఆధారంగా భవిష్యత్లో కస్టమ్స్ సేవల మెరుగుదల, డిజిటల్ మార్పులు, విధానపరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రజలను నేరుగా భాగస్వామ్యం చేయడం ద్వారా మరింత పారదర్శకంగా, ప్రజలకు అనుకూలంగా కస్టమ్స్ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఈ సర్వే కీలక ముందడుగుగా నిలవనుంది.
తాజా వార్తలు
- ఖతార్లో కస్టమ్స్ సేవల మెరుగుదలకు ‘షారెక్’లో సర్వే..!!
- కువైట్లో 45.5 శాతం తగ్గిన కిడ్నాప్ కేసులు..!!
- లైసెన్స్ లేకుండా నగదు బదిలీలు.. ఆసియా ప్రవాసుడు అరెస్ట్..!!
- ఫ్యాషన్ సంస్థకు BD2,300 చెల్లించాలని కోర్టు ఆదేశం..!!
- లైసెన్స్డ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.. సౌదీలో కొత్త నిబంధనలు..!!
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు రోజుకు Dh80కే రెంట్ కార్స్..!!
- దుబాయ్ విమానాశ్రయాల్లో ప్రయాణికుల కోసం GDRFA ప్రత్యేక ఏర్పాట్లు
- మరణశిక్ష కోసం విషపూరిత ఇంజెక్షన్ పద్ధతిని నిరాకరించిన సుప్రీంకోర్టు
- ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఇవే
- అమెరికాలో ఘనంగా భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు







