చట్టాల ఉల్లంఘన పై మెటా సంస్థకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక
- August 18, 2026
న్యూ ఢిల్లీ: సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలోచిన్నారులపై లైంగిక వేధింపుల మెటీరియల్ (CSAM)లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ను అనుమతిస్తే ఐటీ చట్టంలోనిసెక్షన్ 79 ప్రకారం లభించే ‘సేఫ్ హార్బర్’ రక్షణను ఉపసంహరించుకుంటామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY)స్పష్టం చేసింది. ప్లాట్ఫామ్లపై అభ్యంతరకర కంటెంట్ను అరికట్టడంలో విఫలమైతే చట్టపరమైన మినహాయింపులు ఉండవని తేల్చిచెప్పింది. భారతదేశంలోని విభిన్న భాషలు, సామాజిక మరియు సాంస్కృతిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కంటెంట్ మోడరేషన్ వ్యవస్థలను రూపొందించాలని కేంద్రం ఆదేశించింది. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా డీప్ఫేక్ ద్వారా సృష్టించిన కంటెంట్ను వినియోగదారులు సులభంగా గుర్తించేలా తప్పనిసరిగా లేబుల్ చేయాలని అధికారులు సూచించారు.
దేశీయ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే
వాక్ స్వాతంత్య్రం ముఖ్యమైనదే అయినప్పటికీ, దేశంలో పనిచేసే ప్రతీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ స్థానిక చట్టాలు, నిబంధనలకు కట్టుబడి తీరాల్సిందేనని ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల ‘X’ (గతంలో ట్విట్టర్) అకౌంట్ల నిలిపివేతపై తెచ్చిన పారదర్శకత నిబంధనల నేపథ్యాన్ని కూడా ప్రస్తావిస్తూ కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
తాజా వార్తలు
- భూకంప బాధిత కొలంబియాలో 10 పాఠశాలల పునర్నిర్మాణానికి షకీరా హామీ
- టీనేజర్ల కోసం కొత్త వెర్షన్ ChatGPT..!
- యూఏఈలో క్షిపణి ముప్పు అలెర్ట్ ఉపసంహరణ.. సాధారణ కార్యకలాపాలకు అనుమతి
- యూఎస్ అధ్యక్షుడు ట్రంప్తో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- పార్టీ కంటే అభ్యర్థే ప్రధానం-పీపుల్స్ పల్స్ తెలంగాణ పట్టభద్రుల మూడ్ రిపోర్ట్
- ఉచితంగా జర్మన్ భాష నేర్పించి విదేశాల్లో ఉద్యోగాలు!
- చట్టాల ఉల్లంఘన పై మెటా సంస్థకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక
- ఖతార్లో కస్టమ్స్ సేవల మెరుగుదలకు ‘షారెక్’లో సర్వే..!!
- కువైట్లో 45.5 శాతం తగ్గిన కిడ్నాప్ కేసులు..!!
- లైసెన్స్ లేకుండా నగదు బదిలీలు.. ఆసియా ప్రవాసుడు అరెస్ట్..!!







