ఆస్ట్రేలియా ఒలింపిక్ బృందానికి ముప్పు తప్పింది!
- July 30, 2016
ఒలింపిక్స్ లో పాల్గొనాలని బ్రెజిల్ వచ్చిన ఆస్ట్రేలియా ఒలింపిక్ బృందానికి ఓ ముప్పు తప్పింది. ఆసీస్ బృందం బసచేసిన బిల్డింగ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా సిబ్బంది వారిని వెంటనే అక్కడి నుంచి తరలించింది. గ్రౌండ్ ఫ్లోరులో మంటలు ఆకస్మికంగా రావడంతో తమ బృందం కాస్త ఇబ్బంది పడిందని ఆసీస్ అధికార ప్రతినిధి మైక్ టాన్సర్డ్ తెలిపారు. 100 మంది అథ్లెట్లు సహా అధికారులు అక్కడ బస చేసినట్లు తెలిపారు.ఆటగాళ్ల కోసం మొత్తం 31 భవనాలలో ఏర్పాట్లు చేయగా, ఆసీస్ బృందం ఉన్న ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానిక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేసిందని టాన్సర్డ్ వెల్లడించారు. రియో గేమ్స్ కు సమయం దగ్గర పడుతున్నా ఒలింపిక్ విలేజ్ లో వసతుల ఏర్పాట్లు పూర్తికాలేదని, వసతులు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఓ వైపు ఆస్ట్రేలియా ప్రతినిధి కిట్టీ చిల్లర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







