వరదల కారణంగా కొట్టుకుపోయిన పెళ్లిబృందం బస్సు..

- July 30, 2016 , by Maagulf
వరదల కారణంగా కొట్టుకుపోయిన పెళ్లిబృందం బస్సు..

 పాకిస్థాన్‌లో పెళ్లిబృందంతో వెళ్తున్న బస్సు మెరుపు వరదల కారణంగా కొట్టుకుపోవడంతో 15మంది మరణించారు. ఖైబర్‌ ఏజెన్సీలోని పర్వత ప్రాంతంలో నుంచి బస్సు వెళ్తుండగా అకస్మాత్తుగా వరద ముంచుకొచ్చింది. దాంతో బస్సు కొట్టుకుపోయి అందులోని 15 మంది గల్లంతయ్యారు. బస్సులో కచ్చితంగా ఎంతమంది ఉన్నారో తెలియలేదని, 15 మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటి వరకు 20 మంది మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com