వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- February 11, 2026
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అధికారిక కార్యక్రమాలు, జెండా ఎగురవేసేటప్పుడు, రాష్ట్రపతి/గవర్నర్ ప్రసంగాల సమయంలో వందేమాతరం పూర్తి వెర్షన్ను పాడటం తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఒకే ఈవెంట్లో వందేమాతరం, జనగణమన పాడాల్సి వస్తే.. మొదట వందేమాతరమే పాడాలి. ఇది ప్లే అవుతున్నప్పుడు అందరూ లేచి నిలబడాలి.
కేంద్రం జారీ చేసిన నిబంధనల ప్రకారం.. పద్మ అవార్డుల వంటి పౌర పురస్కారాల వేడుకల్లో కూడా వందేమాతరం ప్లే చేస్తారు. రాష్ట్రపతి హాజరయ్యే అన్ని అధికారిక కార్యక్రమాల్లో ఆయన రాక సమయంలో, అలాగే తిరిగి వెళ్లే సమయంలో ఈ గేయం వినిపిస్తుంది. అయితే సామాన్య ప్రజలకు ఊరటనిచ్చేలా సినిమా థియేటర్లలో మాత్రం వందేమాతరం ప్లే చేయాల్సిన అవసరం లేదని.. ఒకవేళ అక్కడ ప్లే చేసినా నిలబడటం తప్పనిసరి కాదని కేంద్రం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్







