భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- February 11, 2026
భారత్లో ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి దాకా 2జీ, 4జీ, 5జీ ప్రపంచాన్ని చూసిన యూజర్లు త్వరలో ఏకంగా 100 జీ చూడబోతున్నారు. దీనికి వేదికగా భారత్ మారబోతోంది. ప్రముఖ దిగ్గజం ఈ టెక్నాలజీపై గట్టిగా కృషి చేస్తోంది. సాధారణంగా ఇంటర్నెట్ అనేది మన జీవితాలో విడదీయలేని భాగం అయిపోయింది. టెక్నాలజీ అమిత వేగంతో దూసుకుపోతోంది. ఒకప్పుడు నెమ్మదిగా లోడ్ అయ్యే వెబ్పేజీలు, వీడియోలు బఫర్ అవుతూ ఆగిపోవడం సాధారణంగా ఉండేది. కానీ స్మార్ట్ఫోన్లు విస్తృతంగా అందుబాటులోకి రావడం, 4G ఇంటర్నెట్ ప్రవేశంతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన డేటా సేవలు అందించడానికి టెలికాం కంపెనీల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఈ పోటీ కారణంగా ఇంటర్నెట్ టెక్నాలజీలో భారీ స్థాయిలో పరిశోధన, అభివృద్ధి జరుగుతోంది.
ఈ క్రమంలోనే ప్రపంచ ప్రసిద్ధ టెలికాం సంస్థ నోకియా(Nokia) భారత్లో ఒక కీలక ముందడుగు వేసింది. తమిళనాడు రాజధాని చెన్నైలో నోకియా తన అతిపెద్ద నెట్వర్క్ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం ఏమిటంటే భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా ఇంటర్నెట్ వేగాన్ని మరింత పెంచే టెక్నాలజీలను అభివృద్ధి చేయడం. ఇక్కడ జరుగుతున్న ముఖ్యమైన పరిశోధనల్లో ఒకటి ఏంటంటే.. 100G ఇంటర్నెట్ టెక్నాలజీ. అయితే, ఈ 100G ఇంటర్నెట్ అంటే ఏమిటి అని చాలామందికి అనుమానం రావొచ్చు. క్లుప్తంగా చెప్పాలంటేడ 100G అంటే సెకనుకు 100 గిగాబిట్ల డేటా బదిలీ వేగం (100 Gbps). ప్రస్తుతం మనం చాలా వేగంగా భావించే 100 Mbps లేదా 1 Gbps కనెక్షన్లతో పోలిస్తే ఇది వందల రెట్లు అధిక సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీ డేటా ప్రసరణను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకువెళ్తుంది. 100G ఇంటర్నెట్ వ్యవస్థ మొత్తం ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఇందులో డేటా విద్యుత్ సంకేతాలుగా కాకుండా.. కాంతి తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. ఈ ప్రక్రియలో కోహెరెంట్ ఆప్టిక్స్ అనే ఆధునిక సాంకేతికత ఉపయోగించబడుతుంది. దీని ద్వారా ఒకే ఫైబర్ కేబుల్ ద్వారా భారీ మొత్తంలో డేటాను ఒకేసారి పంపడం సాధ్యమవుతుంది. చెన్నైలోని నోకియా పరిశోధనా కేంద్రం ఈ టెక్నాలజీని మరింత సమర్థవంతంగా మార్చే పనిలో ఉంది. 100G వంటి సూపర్ ఫాస్ట్ వేగాలను సాధించడానికి DWDM (Dense Wavelength Division Multiplexing) కీలక పాత్ర పోషిస్తుంది.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!









