ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- February 11, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. సభాపతి అధ్యక్షతన కాసేపట్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో, రాబోయే రోజుల అసెంబ్లీ కార్యక్రమాలు, చర్చల వ్యవధి, బిల్లుల ప్రవేశపెట్టే సమయాలపై బీఏసీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
అలాగే, సమావేశాల అజెండాను ఖరారు చేసి సభ్యులకు తెలియజేయనున్నారు.దీని తర్వాత ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ నెల 14వ తేదీన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. మార్చి 12వ తేదీ వరకూ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







