ఒమాన్ లో ఇప్పటివరకు 57,000 మంది పైగా శ్రామికుల పరారీ
- July 21, 2015
ఒమాన్ దేశంలో 2015 సంవత్సరం మొదటి 6 నెలల్లో, 57,420 మంది కార్మికులు తమ యజమానుల వద్దనుండి పారిపొయినట్టు, ఇది దేశవ్యాప్తంగా రేగిస్టార్ ఐన ప్రవాసీయుల సంఖ్యలో మూడవ వంతని, మానవ వనరుల మంత్రిత్వ శాఖ వారు వెల్లడించారు. ఈ సంఖ్యలు కలవరం కలిగిస్తున్నాయని, ఏవైనా సమస్యలుంటే మానవ వనరుల శాఖను సంప్రదించాలని, అధికారులు దీనికి దోవ తీసే మూలకారణాలను వెలికితీయాలని, మజ్లిస్ అల్ షురా సభ్యులు ఒకరు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, నిర్మాణ కంపెనీ యజమాని ఐన రషీద్ ఖల్ఫాన్ - ఈద్ పండుగ అని 3 రోజులు సెలవు ఇస్తే, వారికి ఒప్పందం ప్రకారం అన్ని మొత్తాలు చెల్లిస్తు న్నా కార్మికులు పారిపోయారని వాపోగా...యజమానుల దుష్ప్రవర్తన కారణంగానే ఈ విధంగా జరుగుతోందని, వారి హక్కులను గౌరవించినాట్టైతే ఈ విధంగా జరగదని హెచ్. ఆర్. మానేజర్ - హుస్సైన్ అలీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష అవధి కేవలం 10 రోజులే ఉన్న నేపధ్యంలో ఈ విధంగా జరగడం గమనార్హం!
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







