ఒమాన్ లో ఇప్పటివరకు 57,000 మంది పైగా శ్రామికుల పరారీ
- July 21, 2015
ఒమాన్ దేశంలో 2015 సంవత్సరం మొదటి 6 నెలల్లో, 57,420 మంది కార్మికులు తమ యజమానుల వద్దనుండి పారిపొయినట్టు, ఇది దేశవ్యాప్తంగా రేగిస్టార్ ఐన ప్రవాసీయుల సంఖ్యలో మూడవ వంతని, మానవ వనరుల మంత్రిత్వ శాఖ వారు వెల్లడించారు. ఈ సంఖ్యలు కలవరం కలిగిస్తున్నాయని, ఏవైనా సమస్యలుంటే మానవ వనరుల శాఖను సంప్రదించాలని, అధికారులు దీనికి దోవ తీసే మూలకారణాలను వెలికితీయాలని, మజ్లిస్ అల్ షురా సభ్యులు ఒకరు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, నిర్మాణ కంపెనీ యజమాని ఐన రషీద్ ఖల్ఫాన్ - ఈద్ పండుగ అని 3 రోజులు సెలవు ఇస్తే, వారికి ఒప్పందం ప్రకారం అన్ని మొత్తాలు చెల్లిస్తు న్నా కార్మికులు పారిపోయారని వాపోగా...యజమానుల దుష్ప్రవర్తన కారణంగానే ఈ విధంగా జరుగుతోందని, వారి హక్కులను గౌరవించినాట్టైతే ఈ విధంగా జరగదని హెచ్. ఆర్. మానేజర్ - హుస్సైన్ అలీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష అవధి కేవలం 10 రోజులే ఉన్న నేపధ్యంలో ఈ విధంగా జరగడం గమనార్హం!
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









