యాకూబ్ మెమన్కు మరణశిక్ష ఖాయమైపోయింది
- July 21, 2015
1993 నాటి ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్కు మరణశిక్ష ఖాయమైపోయింది. తనకు విధించిన ఉరిశిక్ష రద్దు కోసం సుప్రీంకోర్టుకు అతడు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇంతకుముందే నిరాకరించారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించినట్లుగా జూలై 30న యాకూబ్ను ఉరితీసే అవకాశాలున్నాయి. మొత్తం 257 మందిని బలిగొన్న నాటి దారుణ మారణకాండకు యాకూబ్ సూత్రధారిగా వ్యవహరించినట్లు రుజువు కావడంతో టాడా కోర్టు మరణశిక్ష విధించింది. కిందటేడాది మార్చి నెలలో సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన యాకూబ్ సోదరుడు టైగర్ మెమన్ పరారీలో ఉన్నాడు. తాజా పరిణామంతో యాకూబ్ని ఉరితీసేందుకు నాగ్పూర్ జైలులో మహారాష్ట్ర పోలీస్ శాఖ కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







