యాకూబ్ మెమన్కు మరణశిక్ష ఖాయమైపోయింది
- July 21, 2015
1993 నాటి ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్కు మరణశిక్ష ఖాయమైపోయింది. తనకు విధించిన ఉరిశిక్ష రద్దు కోసం సుప్రీంకోర్టుకు అతడు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇంతకుముందే నిరాకరించారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించినట్లుగా జూలై 30న యాకూబ్ను ఉరితీసే అవకాశాలున్నాయి. మొత్తం 257 మందిని బలిగొన్న నాటి దారుణ మారణకాండకు యాకూబ్ సూత్రధారిగా వ్యవహరించినట్లు రుజువు కావడంతో టాడా కోర్టు మరణశిక్ష విధించింది. కిందటేడాది మార్చి నెలలో సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన యాకూబ్ సోదరుడు టైగర్ మెమన్ పరారీలో ఉన్నాడు. తాజా పరిణామంతో యాకూబ్ని ఉరితీసేందుకు నాగ్పూర్ జైలులో మహారాష్ట్ర పోలీస్ శాఖ కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









