యాకూబ్ మెమన్కు మరణశిక్ష ఖాయమైపోయింది
- July 21, 2015
1993 నాటి ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్కు మరణశిక్ష ఖాయమైపోయింది. తనకు విధించిన ఉరిశిక్ష రద్దు కోసం సుప్రీంకోర్టుకు అతడు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇంతకుముందే నిరాకరించారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించినట్లుగా జూలై 30న యాకూబ్ను ఉరితీసే అవకాశాలున్నాయి. మొత్తం 257 మందిని బలిగొన్న నాటి దారుణ మారణకాండకు యాకూబ్ సూత్రధారిగా వ్యవహరించినట్లు రుజువు కావడంతో టాడా కోర్టు మరణశిక్ష విధించింది. కిందటేడాది మార్చి నెలలో సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన యాకూబ్ సోదరుడు టైగర్ మెమన్ పరారీలో ఉన్నాడు. తాజా పరిణామంతో యాకూబ్ని ఉరితీసేందుకు నాగ్పూర్ జైలులో మహారాష్ట్ర పోలీస్ శాఖ కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









