టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- February 21, 2026
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో మార్చి 9వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జేఈవో (విద్య, ఆరోగ్యం) డాక్టర్ ఏ. శరత్ ఈ వేడుకల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఈ వేడుకను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా టీటీడీ మహిళా ఉద్యోగులకు అందించే ‘పద్మావతి అవార్డుల’ సంఖ్యను పెంచాలని జేఈవో నిర్ణయించారు. నైపుణ్యం, ప్రతిభ ఆధారంగా అన్ని తరగతుల ఉద్యోగుల నుండి అర్హులైన వారిని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్గనైజింగ్, స్పీకర్స్, కల్చరల్ వంటి పలు కమిటీలను ఏర్పాటు చేసి, వాటి విధులను స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖ మహిళలను అతిథులుగా మరియు ఉపన్యాసకులుగా ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు.
మహిళా దినోత్సవ వేడుకలను పద్మావతి అమ్మవారి వేద ఆశీర్వచనంతో ప్రారంభించాలని జేఈవో సూచించారు. కార్యక్రమం ముగింపులో ‘పద్మావతి వైభవం’ అనే ప్రత్యేక నృత్య రూపకాన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో ఆనంద రాజు, వివిధ మహిళా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మరియు మహిళా అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







