టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- February 21, 2026
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో మార్చి 9వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జేఈవో (విద్య, ఆరోగ్యం) డాక్టర్ ఏ. శరత్ ఈ వేడుకల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఈ వేడుకను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా టీటీడీ మహిళా ఉద్యోగులకు అందించే ‘పద్మావతి అవార్డుల’ సంఖ్యను పెంచాలని జేఈవో నిర్ణయించారు. నైపుణ్యం, ప్రతిభ ఆధారంగా అన్ని తరగతుల ఉద్యోగుల నుండి అర్హులైన వారిని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్గనైజింగ్, స్పీకర్స్, కల్చరల్ వంటి పలు కమిటీలను ఏర్పాటు చేసి, వాటి విధులను స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖ మహిళలను అతిథులుగా మరియు ఉపన్యాసకులుగా ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు.
మహిళా దినోత్సవ వేడుకలను పద్మావతి అమ్మవారి వేద ఆశీర్వచనంతో ప్రారంభించాలని జేఈవో సూచించారు. కార్యక్రమం ముగింపులో ‘పద్మావతి వైభవం’ అనే ప్రత్యేక నృత్య రూపకాన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో ఆనంద రాజు, వివిధ మహిళా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మరియు మహిళా అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









