గ్రౌండ్‌ క్లియరెన్స్‌ పనికి రూ. 10 వేలు లంచం..

- July 31, 2016 , by Maagulf
గ్రౌండ్‌ క్లియరెన్స్‌ పనికి రూ. 10 వేలు లంచం..

ఔరంగాబాద్‌లోని చికల్తాన ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ అలోక్‌ వార్ష్‌నీ లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు దొరికిపోయారు. అనంతరం సీబీఐ అధికారులు ఆయన నివాసం, కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. గ్రౌండ్‌ క్లియరెన్స్‌ పనికి సంబంధించి ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. అలోక్‌పై కేసు నమోదు చేశామని.. అతని ఇల్లు, కార్యాలయంలో దాడులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com