డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- February 21, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు ఉపశమనం కలిగించేలా, అలాగే ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించేలా స్మార్ట్ కార్డుల జారీలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకూ ఉన్న చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల స్థానంలో ఇకపై క్యూఆర్ కోడ్ (QR Code) తో కూడిన కార్డులను జారీ చేయాలని నిర్ణయించింది.
గతంలో తీసుకొచ్చిన చిప్ ఆధారిత విధానంలో ప్రతీ ఆర్సీ లేదా డీఎల్ స్మార్ట్ కార్డు కోసం రూ.200 ఫీజు, పోస్టల్ ఛార్జీలు రూ.35 కలిపి రూ.235 ముందుగానే వసూలు చేసేవారు. కానీ కార్డులు మాత్రం ఇళ్లకు వచ్చేవి కావు. ఆ తర్వాత 2023 నుంచి వాహనదారుల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయడం మానేసి, కార్డులు జారీ చేయడం కూడా మానేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాగానే 2024 అక్టోబర్ 1 నుంచి మళ్లీ ఈ ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
కానీ కార్డులు మాత్రం ఇవ్వడం లేదు. చిప్ తో కూడిన కార్డుకు 115 రూపాయలు ఖర్చవుతుంటే క్యూఆర్ కోడ్ తో కూడిన కార్డుకు 72 రూపాయలే ఖర్చవుతోంది. దీంతో పాటు చిప్ కార్డుల్లో డేటా రీడ్ చేయాలంటే మళ్లీ వాటికి రీడర్లు కొనాలి. క్యూఆర్ కోడ్ తో అయితే కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్ తో లింక్ అయి ఉంటుంది. దీంతో క్యూఆర్ కోడ్ తో కార్డులే ఇవ్వాలని నిర్ణయించారు. దీని ప్రకారం 2024 అక్టోబర్ 1 నుంచి ఇవ్వాల్సిన కార్డుల్ని జారీ చేస్తారు. అలాగే అంతకు ముందు కార్డులు కావాలంటే తిరిగి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









