ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- August 07, 2026
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ బంగారం స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భగ్నం చేశారు. జెడ్డా నుంచి ముంబై మీదుగా ఢిల్లీకి చేరుకున్న ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 869.5 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా అనుమానిత ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ప్రయాణికుడి చెక్-ఇన్ లగేజీలో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ టైర్ల భాగంలో అత్యంత చాకచక్యంగా దాచిన 24 క్యారెట్ల బంగారం 19 ముక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
లగేజీని ఎక్స్రే స్కానింగ్ చేయగా అనుమానాస్పద చిత్రాలు కనిపించడంతో అధికారులు క్షుణ్నంగా సోదాలు నిర్వహించారు. అనంతరం స్కూటర్ టైర్లలో దాచిన బంగారం బయటపడింది.
ఈ ఘటనపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి, బంగారం స్మగ్లింగ్కు సంబంధించిన పూర్తి వివరాలు, ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!
- సౌదీ–టర్కీ–పాకిస్థాన్ మధ్య 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'..
- జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష
- ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ
- పీఎం-జన్ మన్ కింద 2,498 అంగన్వాడీ కేంద్రాలకు ఆమోదం: ఎంపీ బాలశౌరి







