ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!

- February 22, 2026 , by Maagulf
ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!

యూఏఈ: యూఏఈలో ముఖ్యమైన సేవలకు అంతరాయం కలిగించేలా జరిగిన ఉగ్రవాద సైబర్ దాడులను జాతీయ సైబర్ భద్రతా వ్యవస్థ విజయవంతంగా అడ్డుకున్నట్లు యూఏఈ సైబర్ భద్రతా మండలి ప్రకటించింది. ఈ దాడులలో నెట్‌వర్క్‌ లో రాన్సమ్‌వేర్‌ను మోహరించారని, జాతీయ వేదికలను లక్ష్యంగా చేసుకుని వ్యవస్థీకృత ఫిషింగ్ ప్రయత్నాలను అడ్డుకున్నట్లు కౌన్సిల్ వివరించింది. దాడి చేసినవారు సంక్లిష్టమైన ఏఐ టెక్నాలజీలను కూడా ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. పబ్లిక్ సేఫ్టీకి పూర్తి నిబద్ధతతో పని చేస్తుందని సైబర్ భద్రతా మండలి పునరుద్ఘాటించింది. ఏవైనా సైబర్ బెదిరింపులు లేదా అనుమానాస్పద ప్రయత్నాలను నివేదించాలని ప్రతి ఒక్కరినీ కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com