నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

- February 26, 2026 , by Maagulf
నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది.గురువారం ఉదయం 11 గంటలకు అధికారికంగా నోటిఫికేషన్ వెలువడనుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, అభ్యర్థులు మార్చి 5వ తేదీ వరకు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. మార్చి 6న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటే మార్చి 9వ తేదీ లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.

మార్చి 16వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ప్రస్తుత ఎంపీలు అభిషేక్ సింఘ్వీ, సురేష్ రెడ్డిల పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనుండటంతో ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com