సెంట్రల్ మార్కెట్‌లో వ్యాపారులు ఆందోళన..!!

- February 26, 2026 , by Maagulf
సెంట్రల్ మార్కెట్‌లో వ్యాపారులు ఆందోళన..!!

మనామాః మనమా సెంట్రల్ మార్కెట్ కస్టమర్లు లేక నిర్మానుష్యంగా మారింది. ఈమేరకు వ్యాపారులు నివేదించారు. ప్రస్తుత రమదాన్ రోజులలో వ్యాపారం తగ్గిందని వ్యాపారులు తెలిపారు. కొంతమంది మీట్ విక్రేతలు గత సంవత్సరంతో పోలిస్తే ధరలు కిలోగ్రాముకు దాదాపు 500 ఫిల్స్ పెరిగాయని, ఇది వినియోగదారుల కొనుగోళ్లను ప్రత్యక్షంగా ప్రభావితం చేసిందని చెప్పారు. చాలామంది తక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తున్నారు లేదా చౌకైన ప్రత్యామ్నాయాలను కోరుకుంటున్నారని దుకాణదారులు పేర్కొన్నారు. అయితే, చేపల ధరలు స్థిరంగా ఉన్నాయని నివేదించారు.ప్రజల డిమాండ్ కు అనుగుణంగా వివిధ ఎంపికలు అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com