నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- February 26, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది.గురువారం ఉదయం 11 గంటలకు అధికారికంగా నోటిఫికేషన్ వెలువడనుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, అభ్యర్థులు మార్చి 5వ తేదీ వరకు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. మార్చి 6న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటే మార్చి 9వ తేదీ లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.
మార్చి 16వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ప్రస్తుత ఎంపీలు అభిషేక్ సింఘ్వీ, సురేష్ రెడ్డిల పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనుండటంతో ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









