నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- February 26, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది.గురువారం ఉదయం 11 గంటలకు అధికారికంగా నోటిఫికేషన్ వెలువడనుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, అభ్యర్థులు మార్చి 5వ తేదీ వరకు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. మార్చి 6న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటే మార్చి 9వ తేదీ లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.
మార్చి 16వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ప్రస్తుత ఎంపీలు అభిషేక్ సింఘ్వీ, సురేష్ రెడ్డిల పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనుండటంతో ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







