ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి
- February 28, 2026
ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ సైనిక విభాగంలో అత్యంత కీలక నేతగా ఉన్న మహమ్మద్ పాక్పుర్ మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది.
గతేడాది హుస్సేన్ సలామి నుంచి బాధ్యతలు స్వీకరించిన పాక్పుర్, ఇరాన్ సైనిక వ్యూహాల్లో కీలక పాత్ర పోషించారు.ఆయన మరణంతో ఇరాన్ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ఇప్పటికే రాజుకుంటున్న దాడుల పర్వాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిణామంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. అగ్రరాజ్యాలు మరియు అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ దీనిపై ఎలా స్పందిస్తుందనే అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









