బిచ్ఛగాడు నిర్మాత మీడియాకి చుక్కలు చూపించాడు
- July 31, 2016
ఒక చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్ లో ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన సినిమా బిచ్ఛగాడు. ఇప్పటి వరకూ ఈ మూవీ 25 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది. తాజాగా ఈ మూవీ వంద రోజుల వేడుకకి రెడీ అవుతుంది. అయితే డబ్బింగ్ సినిమా కావటంతో ఈ మూవీకి నిర్మాత సైతం తక్కువ పబ్లిసిటీని ఇచ్చారు. ఇక మార్కెట్ లో ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే లాభీయింగ్ చేసి మరీ యాడ్స్ తెచ్చుకునే మీడియా సైతం ఈ మూవీని అంతగా పట్టించుకోలేదు.ఒక్కసారిగా ఈ మూవీకి వచ్చిన సక్సెస్ ని చూసిన మీడియా యాడ్స్ కోసం వెంట పడింది. అప్పటికే ఈ మూవీ 50 రోజుల వేడుకని ఘనంగా జరుపుకుంది. మొదట్లోనే మీడియాకి యాడ్స్ ని ఇవ్వని నిర్మాత, 50 రోజుల వేడుక తరువాత అక్షింతలు వేసినట్టుగా కొద్ది ఛానల్స్ కి మాత్రమే యాడ్స్ ని పరిమితం చేశాడు. ఇప్పుడు ఈ మూవీ 100 రోజులు వేడుకకి రెడీ అవుతుంది.200 థియేటర్లలో 75రోజులను ముగించుకొని ఈ ప్రయాణం కొనసాగుతుంది. దీంతో మీడియా బిచ్ఛగాడు 100 రోజుల వేడుకకి భారీ ప్యాకేజ్ ఇవ్వాల్సిందిగా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. కానీ నిర్మాత మాత్రం మీడియాకి చుక్కలు చూపిస్తున్నారు. బిచ్ఛగాడు కేవలం మౌత్ టాక్ తోనే హిట్ అయిన సినిమా, ఏ ఛానల్ కి యాడ్స్ ని ఇవ్వలేదు.ఇప్పుడు కూడ అనవసరం అంటూ మీడియాని దూరం పెడుతున్నారంట. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా రిపోర్ట్స్ బయటకు చెప్పుకోవటం విశేషం. ఏదైమానా బిచ్ఛగాడు నిర్మాత మీడియాకి చుక్కలు చూపించాడని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ హీరో తెలుగులో డైరెక్ట్ మూవీకి రెడీ అవ్వటం విశేషం.
తాజా వార్తలు
- తెలంగాణ: ఎబోలా కలకలం..విదేశీ ప్రయాణికుల పై ప్రభుత్వం ప్రత్యేక నిఘా!
- మంత్రి లోకేష్ను ముట్టడించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు!
- షార్జాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..నవజాత శిశువుతోపాటు ఫ్యామిలీ సేఫ్..!!
- మే నెలలో 4వెలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించిన LMRA..!!
- మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- జూన్లో సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్









