ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- February 28, 2026
అమరావతి: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో 20 మంది మరణించడం అత్యంత దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని (పరిహారం) ఆయన ప్రకటించారు. బాధితుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, వారికి అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిపై, భద్రతా ప్రమాదాలను పాటించని ఫ్యాక్టరీ నిర్వాహకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
పేలుడు జరిగిన వేట్లపాలెం ప్రాంతాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు, అక్కడ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. అనంతరం ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆయన ఆదేశించారు. ఈ పేలుడు ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సీఎం తెలిపారు. బాణసంచా తయారీ యూనిట్ల వద్ద భద్రతా ప్రమాణాలను కఠినతరం చేస్తామని, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- కువైట్లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!
- ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు
- ట్రంప్తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..
- బిహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరి..!
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి









