ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- February 28, 2026
అమరావతి: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో 20 మంది మరణించడం అత్యంత దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని (పరిహారం) ఆయన ప్రకటించారు. బాధితుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, వారికి అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిపై, భద్రతా ప్రమాదాలను పాటించని ఫ్యాక్టరీ నిర్వాహకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
పేలుడు జరిగిన వేట్లపాలెం ప్రాంతాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు, అక్కడ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. అనంతరం ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆయన ఆదేశించారు. ఈ పేలుడు ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సీఎం తెలిపారు. బాణసంచా తయారీ యూనిట్ల వద్ద భద్రతా ప్రమాణాలను కఠినతరం చేస్తామని, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్









