ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- February 28, 2026
అమరావతి: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో 20 మంది మరణించడం అత్యంత దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని (పరిహారం) ఆయన ప్రకటించారు. బాధితుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, వారికి అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిపై, భద్రతా ప్రమాదాలను పాటించని ఫ్యాక్టరీ నిర్వాహకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
పేలుడు జరిగిన వేట్లపాలెం ప్రాంతాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు, అక్కడ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. అనంతరం ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆయన ఆదేశించారు. ఈ పేలుడు ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సీఎం తెలిపారు. బాణసంచా తయారీ యూనిట్ల వద్ద భద్రతా ప్రమాణాలను కఠినతరం చేస్తామని, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ₹220 కోట్లు ఖర్చు చేసి కుక్కలా మారిన 26 ఏళ్ల కోటీశ్వరుడా?
- తెలుగు రాష్ట్రాలకు ఐఎమ్డీ అలర్ట్: వచ్చే 5 రోజులు వర్షాలు
- యూఏఈ కస్టమ్స్ చర్యలను సమీక్షించిన షేక్ జాయెద్ బిన్ హమద్
- కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన లులు చైర్మన్ యూసఫ్ అలీ
- కువైట్లో ఫ్యామిలీ విజిట్ వీసా నిబంధనల్లో మార్పులు..!!
- అల్ హల్లానియత్ దీవుల వద్ద నౌక ప్రమాదం..!!
- ఎనిమిదేళ్లుగా పెండింగ్లో మసీదుల నిర్మాణం.. నిరాశలో స్థానికులు..!!
- ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ను కొనుగోలు చేసిన సౌదీ నేతృత్వంలోని కన్సార్టియం..!!
- GCC పర్యాటకుల రాకతో ఖతార్ హాస్పిటాలిటీ రంగం వృద్ధి..!!
- అమెరికాలో లెట్యూస్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ .. యూఏఈలో ప్రభావంపై క్లారిటీ..!!







