ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- March 01, 2026
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశంలో ఒక శకం ముగిసింది. టెహ్రాన్లోని తన నివాసంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడిలో ఖమేనీ మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ క్లిష్ట సమయంలో దేశ పగ్గాలను చేపట్టేందుకు అయతొల్లా అలిరెజా అరాఫీని తాత్కాలిక సుప్రీం లీడర్గా నియమించింది. 1989 నుంచి సుదీర్ఘకాలం పాటు ఇరాన్ అత్యున్నత నాయకుడిగా కొనసాగిన ఖమేనీ మృతి ఆ దేశానికి తీరని లోటుగా మారింది.
ఖమేనీ మరణం తర్వాత దేశ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. ఇందులో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, జ్యుడీషియరీ చీఫ్ గులాంహొస్సేన్ మొహసెని ఎజెయి, గార్డియన్ కౌన్సిల్ జ్యూరిస్ట్ ఉంటారని ‘ఐఆర్ఎన్ఏ’ (IRNA) వార్తా సంస్థ తెలిపింది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, 88 మంది సభ్యులున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ తదుపరి పూర్తిస్థాయి సుప్రీం లీడర్ను ఎన్నుకునే వరకు ఈ కౌన్సిల్ బాధ్యతలు నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- ఇరాన్కు రోజుకు రూ.4 వేల కోట్ల నష్టం
- సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- పిల్లల ఇ-స్కూటర్ దుర్వినియోగానికి తల్లిదండ్రులే బాధ్యులా?
- సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే: శుక్రవారం ఉచిత బస్ రైడ్స్..!!
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం









