ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- March 01, 2026
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశంలో ఒక శకం ముగిసింది. టెహ్రాన్లోని తన నివాసంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడిలో ఖమేనీ మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ క్లిష్ట సమయంలో దేశ పగ్గాలను చేపట్టేందుకు అయతొల్లా అలిరెజా అరాఫీని తాత్కాలిక సుప్రీం లీడర్గా నియమించింది. 1989 నుంచి సుదీర్ఘకాలం పాటు ఇరాన్ అత్యున్నత నాయకుడిగా కొనసాగిన ఖమేనీ మృతి ఆ దేశానికి తీరని లోటుగా మారింది.
ఖమేనీ మరణం తర్వాత దేశ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. ఇందులో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, జ్యుడీషియరీ చీఫ్ గులాంహొస్సేన్ మొహసెని ఎజెయి, గార్డియన్ కౌన్సిల్ జ్యూరిస్ట్ ఉంటారని ‘ఐఆర్ఎన్ఏ’ (IRNA) వార్తా సంస్థ తెలిపింది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, 88 మంది సభ్యులున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ తదుపరి పూర్తిస్థాయి సుప్రీం లీడర్ను ఎన్నుకునే వరకు ఈ కౌన్సిల్ బాధ్యతలు నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!









