బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- August 06, 2026
మనామా: బహ్రెయిన్లో నివాస ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కొనసాగుతున్న నిర్మాణ పనులపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, రాత్రి 9 గంటల తర్వాత పనులు నిలిపివేయాలని సదర్న్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు అహ్మద్ అల్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. నివాస ప్రాంతాలకు సమీపంలో చేపట్టే నిర్మాణ పనులకు స్పష్టమైన పని వేళలను నిర్ణయించాలని ఆయన సంబంధిత ప్రభుత్వ విభాగాలు, కాంట్రాక్టర్లకు సూచించారు. రాత్రంతా పనులు కొనసాగుతుండటంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఉదయం వరకు యంత్రాల శబ్దంతో నిద్ర లేక ఇబ్బందిపడుతున్నారని తెలిపారు.
ఇటీవల బ్లాక్ 915లోని నూన్ స్ట్రీట్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ శబ్ద కాలుష్యం కారణంగా ప్రజలు తమ ఇళ్లలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోలేకపోతున్నారని అన్నారు. వేసవి కాలంలో మధ్యాహ్నపు పనులపై అమలులో ఉన్న నిషేధం కారణంగా కాంట్రాక్టర్లు రాత్రి వేళల్లో పనులు చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చని, కానీ వాటి ప్రభావం నివాస ప్రాంతాల ప్రజలపై పడకూడదని అహ్మద్ అల్ అబ్దుల్లా స్పష్టం చేశారు. నివాస ప్రాంతాలను వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలతో సమానంగా చూడకూడదని, కుటుంబాలకు ప్రశాంత వాతావరణం, గోప్యత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రతి నిర్మాణ పనులు ప్రారంభానికి ముందే సంబంధిత శాఖలు, కాంట్రాక్టర్లు కలిసి పని వేళలను నిర్ణయించాలని, నివాస ప్రాంతాల్లో రాత్రి శబ్ద కాలుష్యాన్ని తగ్గించే నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన సూచించారు. రహదారులు, ప్రజా పనులు వేగంగా పూర్తవ్వాల్సిందే కానీ, ప్రజల నిద్ర, ప్రశాంతత, కుటుంబ జీవనానికి భంగం కలిగించే విధంగా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..







