ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- March 01, 2026
హైదరాబాద్: ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతున్నట్లు వస్తున్న వార్తల దృష్ట్యా అక్కడి తెలంగాణ వాసులు తప్పనిసరిగా భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కోరారు. ఆయా దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు, అధికారిక హెచ్చరికలను తుచ తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.
అత్యవసర పరిస్థితులు ఎదురైతే తెలుగు ప్రజలను స్వరాష్ట్రానికి సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని సీఎం భరోసా ఇచ్చారు. ప్రాణాపాయం లేకుండా అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, పరిస్థితులు చక్కబడే వరకు అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









