వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో
- March 03, 2026
మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు ఉగ్రరూపం దాల్చాయి.ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, కోడలు, అల్లుడు, మనుమరాలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఖమేనీ నివాస సముదాయమే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఆయన కుటుంబం మొత్తం చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ వార్త ఇరాన్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇరాన్లో అత్యంత భద్రత ఉండే ఖమేనీ నివాస సముదాయాన్ని ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్, అమెరికా దళాలు సుమారు 30 శక్తిమంతమైన బాంబులను ప్రయోగించినట్లు సమాచారం. నిముషాల వ్యవధిలోనే జరిగిన ఈ విధ్వంసకర దాడిలో భవన సముదాయం పూర్తిగా నేలమట్టమైంది. ఇంతటి పటిష్ట భద్రతను ఛేదించి ఈ దాడి జరగడం ఇరాన్ రక్షణ వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది.
ఈ విషాద ఘటనలో ఖమేనీ 14 నెలల మనుమరాలు జహ్రా మొహమ్మది మరణించడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ చిన్నారికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. రాజకీయాలు, యుద్ధాలతో సంబంధం లేని పసిపాప ప్రాణాలు కోల్పోవడంపై నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









