వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో

- March 03, 2026 , by Maagulf
వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో

మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు ఉగ్రరూపం దాల్చాయి.ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, కోడలు, అల్లుడు, మనుమరాలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఖమేనీ నివాస సముదాయమే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఆయన కుటుంబం మొత్తం చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ వార్త ఇరాన్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఇరాన్‌లో అత్యంత భద్రత ఉండే ఖమేనీ నివాస సముదాయాన్ని ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్, అమెరికా దళాలు సుమారు 30 శక్తిమంతమైన బాంబులను ప్రయోగించినట్లు సమాచారం. నిముషాల వ్యవధిలోనే జరిగిన ఈ విధ్వంసకర దాడిలో భవన సముదాయం పూర్తిగా నేలమట్టమైంది. ఇంతటి పటిష్ట భద్రతను ఛేదించి ఈ దాడి జరగడం ఇరాన్ రక్షణ వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది.

ఈ విషాద ఘటనలో ఖమేనీ 14 నెలల మనుమరాలు జహ్రా మొహమ్మది మరణించడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ చిన్నారికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. రాజకీయాలు, యుద్ధాలతో సంబంధం లేని పసిపాప ప్రాణాలు కోల్పోవడంపై నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com