సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!

- March 05, 2026 , by Maagulf
సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!

మనామాః జాతీయ భద్రతకు ముప్పు కలిగించే కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

అరెస్టు చేసిన వ్యక్తులు ఇరానియన్ దురాక్రమణకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయడంతోపాటు సైనిక సైట్‌ల నుండి వచ్చిన ఫుటేజ్ మరియు దాడులకు సానుభూతి వ్యక్తం చేసేలా మేసేజులు ఉన్నాయని పేర్కొంది. ఇటువంటి కంటెంట్ ప్రజాభిప్రాయాన్ని తప్పుదారి పట్టిస్తుందని, భయాన్ని వ్యాపింపజేస్తుందని మరియు దేశ విలువలు మరియు సూత్రాలను ఉల్లంఘిస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com