గుజరాత్ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ కానుక...
- August 01, 2016
గుజరాత్ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ కానుకను అందించబోతోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్టు 15 నుంచి గుజరాత్లో కార్లు, చిన్న వాహనదారులు టోల్ పన్నును కట్టాల్సిన అవసరం ఉండబోదట. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి కార్లు, ఆటోరిక్షాలు, చిన్నవాహనాలను టోల్ ట్యాక్స్ల నుంచి మినహాయిస్తున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ట్వీట్ చేశారు. నిరంతరం టోల్ బూత్లను దాటుకుంటూ ఆఫీసులకూ, కాలేజీలకూ వెళ్లే వాహనదారులకు ట్యాక్స్ కట్టడం భారంగా మారుతోందని.. అందుకే మినహాయింపు కల్పిస్తున్నట్లు ఆనందీబెన్ తెలిపారు. గుజరాత్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!







