జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- December 21, 2025
రియాద్: జనవరి 1నుండి గృహ కార్మికులందరి జీతాలను వారి యజమానుల ద్వారా అధికారిక మార్గాల ద్వారా బదిలీ చేయాలనే నిర్ణయాన్ని మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేయనుంది. గృహ కార్మికుల జీతాలకు సంబంధించిన హక్కులను పరిరక్షించడంలో మరియు యజమానులు, ఉద్యోగుల మధ్య ఒప్పంద సంబంధంలో పారదర్శకతను పెంపొందించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా పేర్కొన్నారు.
ముసానెడ్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్ జీతాల ట్రాన్స్ ఫర్ సేవ, వేతన చెల్లింపుల విశ్వసనీయతను పెంచడానికి చాలా కీలకమని ప్రకటించారు. నిర్దేశిత అధికారిక మార్గాల ద్వారా గృహ కార్మికుల జీతాలు చెల్లించే సేవ యజమానులకు మరియు ఉద్యోగులకు అనేక ప్రయోజనాలను అందిస్తుందని పేర్కరొన్నారు. జనవరి 2025లో ప్రారంభించిన రెండవ దశ, నలుగురు లేదా అంతకంటే ఎక్కువ గృహ కార్మికులు ఉన్న యజమానులకు వర్తిస్తుంది.
గృహ కార్మికుడు వేతన రక్షణ వ్యవస్థ పరిధిలోకి వచ్చే వర్గంలోకి వస్తే, జీతాల బదిలీలు తప్పనిసరిగా ఆమోదించబడిన మార్గాల ద్వారానే చేయాలని గమనించాలి. కార్మికుడు వేతన రక్షణ వ్యవస్థ పరిధిలోకి వచ్చే వర్గంలోకి రాకపోతే, కార్మికుడు ఒక నిర్దిష్ట బ్యాంకు ఖాతాకు బదిలీ చేయమని అభ్యర్థించనంత వరకు, వేతనాలు మరియు ఇతర చెల్లింపులను రాతపూర్వక పత్రాలతో నగదు రూపంలో లేదా చెక్కు ద్వారా లేదా గృహ కార్మికుడి జీతం కార్డు ద్వారా చెల్లించవచ్చు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









