నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- March 07, 2026
కువైట్: కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా..ఆ దేశ జాతీయ జల నియంత్రణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. జల నెట్వర్క్ కార్యకలాపాలను సమీక్షించారు. ప్రధానమంత్రితో పాటు విద్యుత్ మరియు నీటి నెట్వర్క్ మంత్రి డాక్టర్ సబా అబ్దులాజీజ్ అల్-ముఖైజిమ్ మరియు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అదెల్ మొహమ్మద్ అల్-జమిల్ ఉన్నారు.
తన పర్యటనలో భాగంగా జల వ్యవస్థ పనితీరును నిశితంగా పరిశీలించారు. వాటర్ నెట్వర్క్ పనితీరును పరిశీలించారు.అత్యవసర పరిస్థితులకు సమర్థవంతంగా స్పందించడానికి సాంకేతిక బృందాల సంసిద్ధతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్కింగ్ టీముల అంకితభావాన్ని, కృషిని ప్రశంసించారు.
దేశవ్యాప్తంగా అవసరమైన సేవలు మరియు మౌలిక సదుపాయాల స్థిరత్వాన్ని కొనసాగించడానికి నిరంతర అప్రమత్తత, సంసిద్ధత ప్రాముఖ్యతను ప్రధానమంత్రి తెలియజేశారు.
తాజా వార్తలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్
- జూన్ 15 లోపు యూనిఫారాల పంపిణీ: సీఎం రేవంత్
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!









