బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- April 30, 2026
మనామా: బుదైయాలో 50 ఏళ్ల వయసున్న వ్యక్తిని హత్య చేసి ఇద్దరు ఆసియన్లకు జీవిత ఖైదు విధించారు. 25, 28 ఏళ్ల వయసున్న ఆ ఇద్దరు వ్యక్తులు తమ శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత బహ్రెయిన్ నుండి శాశ్వతంగా బహిష్కరించాలని హై క్రిమినల్ కోర్టు ఆదేశించింది.
2025 డిసెంబర్ 28న నార్తర్న్ గవర్నరేట్లో నిందితుల తమ జాతీయతకే చెందిన వ్యక్తిని హత్య చేశారు. దాదాపు రెండు నెలల పాటు అతని కదలికలను గమనించి హత్యకు పాల్పడ్డారని విచారణలో గుర్తించారు.
ఒక ఫిర్యాదు అందిన తర్వాత తాను సంఘటనా స్థలానికి వెళ్లగా, బాధితుడు రక్తంతో తడిసి నేలపై పడి ఉండటాన్ని చూశానని ఒక పోలీస్ దర్యాప్తు అధికారి కోర్టుకు తెలిపారు. సమీపంలోని ఒక ఇంటి సీసీకెమెరా ఫుటేజ్ ఆధారంగా అధికారులు ఆ ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్టు తెలిపారు.
హత్య అనంతరం కింగ్ ఫహద్ కాజ్వే మీదుగా పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారని కోర్టుకు తెలిపారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







