ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- March 07, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్లోని ఆఫ్రికన్ దేశాల రాయబారులతో విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ అల్బుసైది సమావేశం నిర్వహించారు. అలాగే, మధ్య ఆసియా దేశాల రాయబారులు మరియు అజర్బైజాన్ రాయబారుతో కూడా విడిగా భేటీ అయ్యారు.
ప్రస్తుతం కొనసాగుతున్న సంఘర్షణ మరియు భద్రత, స్థిరత్వం మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దాని వల్ల కలిగే తీవ్రమైన సవాళ్లు, ఇతర పరిణామాలపై తన వైఖరిని స్పష్టం చేయడానికి దౌత్య ప్రయత్నాలలో భాగంగా ఈ సమావేశాలు జరిగాయని అధికారులు తెలిపారు.
కాల్పుల విరమణ సాధించడానికి అంతర్జాతీయంగా సమన్వయంతో కూడిన ప్రయత్నాలు చాలా అవసరమని సమావేశాల సందర్భంగా సయ్యద్ బదర్ అన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ మరియు అమెరికన్ యుద్ధాన్ని..ఈ ప్రాంతంలోని దేశాల పై ఇరాన్ ఆమోదయోగ్యం కాని దాడులకు స్వస్తి పలకాలని ఆయన పిలుపునిచ్చారు.
వివిధ ప్రాంతీయ మరియు అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణించాలనుకునే వారికి ఒమన్ తన భూభాగం మరియు విమానాశ్రయాల ద్వారా రవాణాను సులభతరం చేయడానికి తన మానవతా ప్రయత్నాలను కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







