ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- March 07, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్లోని ఆఫ్రికన్ దేశాల రాయబారులతో విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ అల్బుసైది సమావేశం నిర్వహించారు. అలాగే, మధ్య ఆసియా దేశాల రాయబారులు మరియు అజర్బైజాన్ రాయబారుతో కూడా విడిగా భేటీ అయ్యారు.
ప్రస్తుతం కొనసాగుతున్న సంఘర్షణ మరియు భద్రత, స్థిరత్వం మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దాని వల్ల కలిగే తీవ్రమైన సవాళ్లు, ఇతర పరిణామాలపై తన వైఖరిని స్పష్టం చేయడానికి దౌత్య ప్రయత్నాలలో భాగంగా ఈ సమావేశాలు జరిగాయని అధికారులు తెలిపారు.
కాల్పుల విరమణ సాధించడానికి అంతర్జాతీయంగా సమన్వయంతో కూడిన ప్రయత్నాలు చాలా అవసరమని సమావేశాల సందర్భంగా సయ్యద్ బదర్ అన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ మరియు అమెరికన్ యుద్ధాన్ని..ఈ ప్రాంతంలోని దేశాల పై ఇరాన్ ఆమోదయోగ్యం కాని దాడులకు స్వస్తి పలకాలని ఆయన పిలుపునిచ్చారు.
వివిధ ప్రాంతీయ మరియు అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణించాలనుకునే వారికి ఒమన్ తన భూభాగం మరియు విమానాశ్రయాల ద్వారా రవాణాను సులభతరం చేయడానికి తన మానవతా ప్రయత్నాలను కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!









