ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- March 07, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్లోని ఆఫ్రికన్ దేశాల రాయబారులతో విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ అల్బుసైది సమావేశం నిర్వహించారు. అలాగే, మధ్య ఆసియా దేశాల రాయబారులు మరియు అజర్బైజాన్ రాయబారుతో కూడా విడిగా భేటీ అయ్యారు.
ప్రస్తుతం కొనసాగుతున్న సంఘర్షణ మరియు భద్రత, స్థిరత్వం మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దాని వల్ల కలిగే తీవ్రమైన సవాళ్లు, ఇతర పరిణామాలపై తన వైఖరిని స్పష్టం చేయడానికి దౌత్య ప్రయత్నాలలో భాగంగా ఈ సమావేశాలు జరిగాయని అధికారులు తెలిపారు.
కాల్పుల విరమణ సాధించడానికి అంతర్జాతీయంగా సమన్వయంతో కూడిన ప్రయత్నాలు చాలా అవసరమని సమావేశాల సందర్భంగా సయ్యద్ బదర్ అన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ మరియు అమెరికన్ యుద్ధాన్ని..ఈ ప్రాంతంలోని దేశాల పై ఇరాన్ ఆమోదయోగ్యం కాని దాడులకు స్వస్తి పలకాలని ఆయన పిలుపునిచ్చారు.
వివిధ ప్రాంతీయ మరియు అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణించాలనుకునే వారికి ఒమన్ తన భూభాగం మరియు విమానాశ్రయాల ద్వారా రవాణాను సులభతరం చేయడానికి తన మానవతా ప్రయత్నాలను కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్
- జూన్ 15 లోపు యూనిఫారాల పంపిణీ: సీఎం రేవంత్
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!









