క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- March 07, 2026
దుబాయ్: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ సంచలన ప్రకటన చేశారు. టెలివిజన్లో కీలక ప్రసంగం చేశారు. పక్క దేశాలపై దాడులు చేయబోమని తెలిపారు. ఈ సందర్భంగా ఇరుగుపొరుగు దేశాలకు కూడా క్షమాపణలు చెప్పారు. “మా జోలికి రాకుంటే.. మీ జోలికి రాబోం.. ఇజ్రాయెల్, అమెరికాకు లొంగే ప్రసక్తే లేదు.” అని తేల్చి చెప్పారు. లొంగిపోవాలని కలలు కనే వారు కచ్చితంగా విఫలమవుతారన్నారు.
ప్రసంగ సమయంలో మసౌద్ పెజెష్కియన్ శాంతి హస్తాన్ని చూపారు. ఇరాన్ శాంతిని ప్రేమించే దేశమని.. ప్రాంతీయ స్థిరత్వం కోసమే సైనిక చర్యను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మన సార్వభౌమాధికారంపై దృఢమైన వైఖరిని తీసుకున్నట్లు వివరించారు.
ఇదిలా ఉంటే పెజెష్కియన్ టెలివిజన్ ప్రసంగానికి ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కీలక సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి రష్యా మద్దతు ఇస్తుందని పుతిన్ వెల్లడించారు. ఏదైనా సమస్యను బలవంతంగా కాకుండా చర్చలు.. దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
అయితే అంతర్జాతీయ ఒత్తిడితోనే ఇరాన్ వైఖరి మారినట్లుగా నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం యుద్ధ భయాలు తారాస్థాయికి చేరడంతో ఇరాన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం."గల్ఫ్ దేశాలపై దాడులను ఆపేస్తున్నాం..వారివైపు నుండి దాడి ఉంటే మాత్రం ప్రతిస్పందిస్తాం" - ఇరాన్ అధ్యక్షుడు
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







