సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- March 07, 2026
హైదరాబాద్: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించే ప్రెస్మీట్లో జరగనుంది.
పోలీసులు మరియు కేంద్ర భద్రతా బలగాలు చాలా కాలంగా వెతుకుతున్న పలువురు మావోయిస్టులు ఇందులో భాగమవుతారని తెలుస్తోంది. మొత్తం 124 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోనుండగా, వారిలో కొందరు కీలక నాయకుల అనుచరులు మరియు గన్మెన్లు కూడా ఉన్నట్లు సమాచారం.
ఇటీవలే సరెండర్ అయిన దేవ్ జి కు చెందిన గన్మెన్లు, అనుచరులు కూడా ఈ జాబితాలో ఉన్నారని తెలుస్తోంది. అయితే మావోయిస్టు ఉద్యమంలోని కీలక నేతముప్పాళ్ల లక్ష్మణ రావు (గణపతి) కూడా వీరిలో ఉంటారా? అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ లొంగుబాటు కార్యక్రమం తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందా? అనే విషయంపై రాజకీయ మరియు భద్రతా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









