రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించిన యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- March 09, 2026
అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు మరియు సాయుధ దళాల సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించారు.ఇటీవలి ప్రాంతీయ పరిణామాలు, రక్షణ మరియు సైనిక వ్యవహారాలకు సంబంధించిన తాజా పరిస్థితులను సమీక్షించడానికి ఆయన ఈ సందర్శన చేపట్టారు.
ఈ సందర్భంగా యూఏఈ సాయుధ దళాల సిద్ధత, సామర్థ్యాలు మరియు ప్రాంతంలో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే చర్యలపై ఆయనకు ఉన్నతాధికారులు వివరించారు. అలాగే ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వంపై ప్రభావం చూపుతున్న పరిస్థితులపై కూడా సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్శనలో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్తో పాటు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాని మరియు రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, అల్ ఐన్ ప్రాంతానికి రూలర్ ప్రతినిధి షేక్ హజ్జా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ప్రెసిడెన్షియల్ కోర్ట్ డెవలప్మెంట్ మరియు ఫాలెన్ హీరోస్ వ్యవహారాల ఉపాధ్యక్షుడు షేక్ థియాబ్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా పాల్గొన్నారు.
అదనంగా రక్షణ వ్యవహారాల రాష్ట్ర మంత్రి మొహమ్మద్ ముబారక్ ఫాదెల్ అల్ మజ్రూయి, రక్షణ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ ఇబ్రహీం నాసర్ అల్ అలావి, యూఏఈ అధ్యక్షుడికి మిలిటరీ వ్యవహారాల సలహాదారు హమద్ మొహమ్మద్ థాని అల్ రుమైతి, ఎగ్జిక్యూటివ్ అఫైర్స్ అథారిటీ చైర్మన్ ఖల్దూన్ ఖలీఫా అల్ ముబారక్, స్ట్రాటజిక్ రీసెర్చ్ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వ్యవహారాల సలహాదారు ఫైసల్ అబ్దుల్ అజీజ్ మొహమ్మద్ అల్ బన్నాయితో పాటు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు.

తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









