చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు స్మృతి ఇరానీ వినూత్నంగా ముందడుగు

- August 01, 2016 , by Maagulf
చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు స్మృతి ఇరానీ వినూత్నంగా ముందడుగు

దేశంలో చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ వినూత్నంగా ముందడుగు వేశారు. బిహార్‌ నుంచి తెప్పించిన చేనేత సిల్క్‌ చీరను ధరించిన ఆమె ఆ ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అంతేకాకుండా ఐవేర్‌ హ్యాండ్లూమ్‌ యాష్‌ట్యాగ్‌ (#IWearHandloom)తో ఆమె సరికొత్త ఆన్‌లైన్‌ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు కూడా చేనేత వస్త్రాలు ధరించి.. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయాలని, ఐవేర్‌ హ్యాండ్లూమ్‌ యాష్‌ట్యాగ్‌ తో ఆ పోస్టుకు మరో ఐదుగురిని ట్యాగ్‌ చేయాలని, ఆ ఐదుగురు కూడా ఇలా చేయడం ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలువాలని ఆమె కోరారు.ఎంతో ఘనవైభవం కలిగిన చేనేత రంగం ఇప్పుడు అనేక కష్టాలతో సతమతమవుతున్నది. మొన్నటివరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా ఉండి పలు వివాదాలు ఎదుర్కొన్న స్మృతిని ఆ శాఖ నుంచి తప్పించి.. కేంద్ర జౌళి శాఖకు బదలాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చేనేత రంగం అభివృద్ధికి ఆమె సంకల్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com