టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా..
- March 10, 2026
టీ20 ప్రపంచకప్2026 విజేతగా నిలిచిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రూ.131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ఈ క్రమంలో తన రికార్డును తానే బద్దలు కొట్టింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు బార్బడోస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచినప్పుడు రూ.125 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో పోలిస్తే అదనంగా రూ.6 కోట్లు సూర్యకుమార్ సారథ్యంలోని జట్టుకు అందనుంది.
‘ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్2026లో విజేతగా నిలిచినందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమ్ఇండియాకు 131 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి భారత్ ప్రతిష్టాత్మక ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్ కప్పును నిలబెట్టుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా రెండో సారి ప్రపంచకప్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇక మొత్తంగా మూడు సార్లు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలవడంతో అత్యధిక సార్లు పొట్టి ప్రపంచకప్ను సాధించి తొలి జట్టుగా ఘనత సాధించింది. ఈ ఫార్మాట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.
ఈ చారిత్రాత్మక విజయానికి ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలెక్టర్లను బోర్డు మరోసారి అభినందిస్తుంది. భవిష్యత్తులో వారు విజయం సాధించాలని కోరుకుంటోంది.’ అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలవడంతో సూర్యకుమార్ యాదవ్ సేన ఐసీసీ నుంచి ప్రైజ్మనీగా 27.48 కోట్లను సొంతం చేసుకుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజలు తరలింపు
- లోక్సభ స్పీకర్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం..
- టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా..
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!









