గల్ఫ్ దేశాల పై దాడులు ఆపాలంటూ సమితిలో తీర్మానం
- March 12, 2026
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధాన్ని కాస్తయినా ఆపేందుకు అంతర్జాతీయ సమాజం గట్టి చర్యలు చేపట్టింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరుపుతున్న దాడులను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశ పెట్టిన తీర్మానం భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి భారతదేశం కో-స్పాన్సర్గా నిలిచి తన వ్యూహాత్మక మద్దతును ప్రకటించడం గమనార్హం కాగా ఇరాన్కు మిత్ర దేశాలు అయిన చైనా, రష్యా వంటి దేశాలు కనీసం దీనికి అడ్డు చెప్పలేకపోయాయి.ముఖ్యంగా ఈ ఓటింగ్లో పాల్గొనకుండా ఉండడమే కాకుండా ఖమేనీ మృతి గురించి చర్చ తీసుకురాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాయి.
బహ్రెయిన్ నేతృత్వంలో వచ్చిన ఈ తీర్మానానికి ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలు మద్దతు తెలిపాయి. అందులో భారత్ కూడా ఉండడం గమనార్హం. ఇరాన్ దాడులు అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కుతున్నాయని ఇది ప్రపంచ శాంతికి పెను ముప్పుగా మారిందని ఈ తీర్మానం చెప్పింది. ప్రధానంగా బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్ వంటి దేశాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను వెంటనే ఆపాలని ఐరాస స్పష్టం చేసింది. అంతేకాకుండా హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకల రాకపోకలను అడ్డుకోవడాన్ని, సముద్ర మార్గాల్లో అశాంతిని సృష్టించడాన్ని భద్రతా మండలి ఏక కంఠంతో ఖండించింది.
భద్రతా మండలిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉండగా 13 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఇరాన్కు ఆప్త మిత్రులుగా పేరున్న రష్యా, చైనాలు మాత్రం దీనికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా కేవలం ఓటింగ్కు దూరంగా ఉండిపోయాయి. అయితే ఈ తీర్మానంపై రష్యా, చైనా అసంతృప్తి వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..







