తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

- March 15, 2026 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత దృష్ట్యా రేపటి నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.ఏపీలో ఉదయం 7.45 నుండి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహిస్తారు.విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 7.45 గంటలకే క్లాసులు మొదలవుతాయి. అటు తెలంగాణలో ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు నడుస్తాయి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

స్కూల్ ముగిసిన వెంటనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించి ఇంటికి పంపిస్తారు. విద్యార్థులు ఎండ బారిన పడకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల సమయాలను బట్టి జాగ్రత్తలు తీసుకోవాలని విద్యా శాఖ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com