నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- March 15, 2026
న్యూ ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల సంఘం వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 9న అస్సాం, కేరళ మరియు పుదుచ్చేరిలో పోలింగ్ నిర్వహించనున్నారు. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.
పశ్చిమ బెంగాల్లో మాత్రం రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 23న జరగగా, రెండో దశ ఏప్రిల్ 29న జరుగుతుంది.
నాలుగు రాష్ట్రాలు మరియు పుదుచ్చేరి కలిపి మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడులో 234, పశ్చిమ బెంగాల్లో 294, కేరళలో 140, అస్సాంలో 126 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్కు కొత్త అద్దె సూచిక.. కొత్త చట్టంతో పారదర్శకతకు ప్రాధాన్యం
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే







