కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- March 15, 2026
న్యూ ఢిల్లీ: దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్రం శనివారం ఒక ప్రకటన చేసింది. పీఎన్జీతో పాటు ఎల్పీజీ కనెక్షన్ కూడా ఉంటే.. ఆ వినియోగదారులు వెంటనే తమ ఎల్పీజీ కనెక్షన్ను తక్షణమే సరెండర్ చేయాలని సూచించింది.అలాగే ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు, వారి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఎల్పీజీ (LPG) సిలిండర్ రీఫిల్ తీసుకోవద్దని కూడా సూచించింది.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పాటు పీఎన్జీ (PNG) వినియోగదారులు కొత్తగా డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవడాన్ని కూడా నిషేధించారు.
నివారం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఇలా పేర్కొన్నారు: “పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వ్యక్తి, అదే సమయంలో డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్ను కొనసాగించకూడదు. అలాగే ప్రభుత్వ ఆయిల్ కంపెనీల నుంచి లేదా వారి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ కూడా తీసుకోకూడదు. అలాంటి వారు తమ ఎల్పీజీ కనెక్షన్ను వెంటనే సరెండర్ చేయాలి.”
మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మన దేశంలో గ్యాస్ సిలిండర్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రభావం ఎక్కువగా హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్ల మీద పడుతోంది. ఇప్పటికే చాలా హోటళ్లు అధిక గ్యాస్ వినియోగించుకునే వంటలను మెనూ నుంచి తొలగించాయి.
తాజా వార్తలు
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!









